యాచారం, నవంబర్ 27 : మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్ అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి, చింతపట్ల, కేసీతండా, మేడిపల్లి గ్రామాల్లో ఆదివారం ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామశాఖ సమావేశాలను విజయవంతం చేయాలన్నారు. డిసెంబర్ 1లోగా సమావేశాలను పూర్తి చేసి, 50మంది ముఖ్య కార్యకర్తలను ఎంపిక చేయాలన్నారు. మండలంలోని 24గ్రామాలను 4జోన్లుగా విభజించి ఎమ్మెల్యే కిషన్రెడ్డి సూచన మేరకు జోన్ వారీగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి భాష, ఎంపీటీసీ శివలీల, సింగిల్విండో డైరెక్టర్ స్వరూప, నాయకులు కిషన్, మధు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలి
ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో టీఆర్ఎస్ బలోపేతానికి మరింత కృషి చేయాలని టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్ష కార్యదర్శి కొప్పు జంగయ్య, పి. శ్రీకాంత్ అన్నారు. ఆదివారం ఆదిబట్ల మున్సిపాలిటీ టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడానికి కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని వారు సూచించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు పి.గోపాల్గౌడ్, నాయకులు కె. జంగయ్య, కౌన్సిలర్లు మహేందర్, వి.శ్రీనివాస్, నాగేశ్, కృష్ణంరాజు, సుధాకర్, నాయకులు బబ్లూ, నారాయణ, రవీందర్, శ్రీనివాస్, దయాకర్, వీరారెడ్డి, నర్సింహ, రసూల్ఖాన్, ప్రవీణ్, సదానంద్, రామారావ్, యెల్లారెడ్డి పాల్గొన్నారు.
పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాలి
టీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు ఆధ్వర్యంలో పల్లెపల్లెకు టీఆర్ఎస్ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆదివారం మండల పరిధిలోని దండుమైలారం, నెర్రపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్ మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయి నుంచే పటిష్టంగా తయారు చేయాలన్న సంకల్పంతో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్టు, దళితబంధుతో పాటు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయన్నారు. వీటిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తపై ఉందని అన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సారథ్యంలో పార్టీని నియోజకవర్గంలో మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దటం కోసం అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, సహకారసంఘం చైర్మన్ బిట్ల వెంకట్రెడ్డి, సర్పంచ్లు రవణమోని మల్లీశ్వరి, భాస్కర్గౌడ్, జిల్లా నాయకులు రవణమోని జంగయ్య ముదిరాజ్, గ్రామశాఖ అధ్యక్షుడు ఐలేష్, నాయకులు సురేష్, రణదీర్, రవీందర్, ప్రేకుమార్, శ్రీశైలం, భాషాతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు విశ్వసించరు
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మడంలేదని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు కంబాల పరమేశ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామంలో పార్టీ మండలాధ్యక్షుడు పరమేశ్, నాయకుడు రాజాగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా క్యాతిక మహేశ్యాదవ్, ఉపాధ్యక్షుడిగా బొర్ర మల్లేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కంబాల ప్రశాంత్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పరమేశ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయాన్ని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. ఉనికిని కోల్పోతామనే భయంతో ప్రతిపక్షాలు దీక్షలు, ధర్నాలు చేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు నియమాక పత్రాలను అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు గిరి, మంజుల, రమేశ్, సుశీలా, దేవ్లానాయక్, మానస, కుమార్గౌడ్, శ్రీరాములు, శ్రీనునాయక్, మహేశ్ కోఆప్షన్ సభ్యులు కృష్ణయ్యయాదవ్, నర్సింహాగౌడ్, నాయకులు చంద్రునాయక్, గిరిధర్, రాజు, సురేశ్, ప్రేమ్కుమార్, భాస్కర్, మల్లేశ్, శివ, మహేశ్, రమేశ్, గణేశ్, రామకృష్ణ పాల్గొన్నారు.