తాండూరు, నవంబర్ 27 : తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి రూ.134.50 కోట్లు మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆదివారం సీఎం కేసీఆర్ను హైదరాబాద్లో తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబడిన తాండూరు అభివృద్ధికి తాము కోరిన విధంగా నిధులు విడుదల చేయడంపై నియోజవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నూతన అభివృద్ధి పనులతో పాటు పెండింగ్లో ఉన్న పనులను వెంటనే ప్రారంభించి గడువులోగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు సహకరించాలని కోరారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.