వికారాబాద్ : సీఎం సహాయనిధి పథకం నిరుపేదలకు వరంలా మారిందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం ఆయన వికారాబాద్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 54 మంది లబ్ధిదారుల కు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్తో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నదన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కమాల్రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.