వికారాబాద్, జూలై 12 : ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం మర్పల్లి మండలం కొంశట్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులుఎమ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తుందన్నారు. ప్రజలు టీఆర్ఎస్ పాలనలో సంతోషంగా ఉన్నారని తెలిపారు.
రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు తీసుకొచ్చి ప్రజలను అభివృద్ధి పరిచేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.