కోట్పల్లి, ఏప్రిల్ 21 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఆదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కోట్పల్లి పోలీస్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం మల్శేట్పల్లి తాండాకు చెందిన వాంకుడోతు శ్రీకాంత్ (17) ఇసుకను తరలిస్తున్నాడు.
ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి ఇంజిన్ పైకి లేవడంతో డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్ ట్రాలీకి ఇంజిన్కి మధ్యలో ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలనానికి చేరుకొని మృతిని తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.