తాండూరు : తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలో టీఆర్ఎస్ మండల కమిటీల నియామకం ఏకగ్రీవంగా జరిగింది. తాండూరు పట్టణ అధ్యక్షుడిగా నయీం (అప్పు), తాండూరు మండల అధ్యక్షుడిగా రాందాస్, యాలాల మండల అధ్యక్షుడిగా మల్లారెడ్డి, బషీరాబాద్ మండల అధ్యక్షుడిగా రాములునాయక్, పెద్దేముల్ మండల అధ్యక్షుడిగా కోహిర్ శ్రీనివాస్లను ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, టీఆర్ఎస్ ఇన్చార్జి జహంగీర్పాష కలిసి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం దూసుకు పోతుందన్నారు.
దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలు ఏవైన టీఆర్ఎస్దే ఘన విజయమని తెలిపారు. టీఆర్ఎస్లో వర్గాలు లేవని తేల్చి చెబుతూ అందరూ సమన్వయంతో పార్టీ పటిష్టతకు పని చేయాలని కోరారు. పాత తాండూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం పార్లమెంట్లో మాట్లాడడం జరిగిందని సాధ్యమైనంత త్వరలో బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల తప్పకుండా వస్తుందని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులపై అభివృద్ధి బాధ్యత ఉంటుందని అందుకు తగ్గట్లు పనిచేయాలని సూచించారు. టీఆర్ఎస్ ఇన్చార్జి జహంగీర్పాష మాట్లాడుతూ అందరి సమన్వయంతోనే పార్టీ పదవుల ఎంపిక జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రబ్బాని, విశ్వనాథ్గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.