ఆర్కేపురం(వికారాబాద్) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) త్వరగా కోలుకోవాలని వికారాబాద్ జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) శుక్రవారం పూజలు నిర్వహించారు. ఆర్కేపురంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్లోని ఫౌమ్హౌస్లో బాత్రూమ్లో కాలుజారి కిందపడి గాయపడ్డ కేసీఆర్ త్వరగా కోలుకోవాలని పూజలు చేసినట్లు ఆయన వెల్లడించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ కేసీఆర్కు ఉంటాయని అన్నారు. తెలంగాణ కోసం నిరంతరం పరితపించే నాయకుడు కేసీఆర్ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, నాయకులు న్యాలకొండ శ్రీనివాస్రెడ్డి, గొడుగు శ్రీనివాస్ముదిరాజ్, సిద్దగోని వెంకటేష్గౌడ్, మురళీధర్రెడ్డి, వల్లూరి రమేష్, కంచర్ల శేఖర్, ముచింతల జగన్, బాలుశ్రీ, మహేందర్రెడ్డి తదితరులు ఉన్నారు.