పరిగి : పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగి నియోజకవర్గంలోని పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, గండీడ్ మండలాలకు చెందిన 28మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 19.95లక్షలకు సంబంధించిన చెక్కులు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సర్కారు తోడ్పాటు అందిస్తుందన్నారు. కార్పొరేట్ దవాఖానలో చికిత్సలు పొందిన వారికి సర్కారు సీఎంఆర్ఎఫ్ కింద సహాయం అందజేస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం వేలాది మందికి సహాయం అందుతుందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, సీనియర్ నాయకులు కొప్పుల అనిల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేందర్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్. ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, నార్మాక్స్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జగదీశ్వర్, రవికుమార్ పాల్గొన్నారు.