వికారాబాద్,జూన్ 7: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని 4,5,16 వవార్డు గంగారంలో పర్యటించి పట్టణ ప్రగతిని పరిశీలిం చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంతో వికారాబాద్ పట్టణాన్ని మరింత శుభ్రంగా తీర్చి దిద్దాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
అందరూ భాగస్వామ్యం కావాలి
ధారూరు, జూన్ 7: హరిత హారం కార్యక్రమానికి మొక్కలు నాటేందుకు గుంతలు తీయడం పూర్తి చేసుకొని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని డీఆర్డీవో కృష్ణన్ తెలిపారు.. మంగళవారం ధారూరు మండల కేంద్రంలో ప్రగతి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహరం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో చంద్రశేఖర్, ప్రత్యేక అధి కారి ఆనంద్, గ్రామ సర్పంచ్ చంద్రమౌళి ఉన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
మర్పల్లి, జూన్ 7: అందరూ మొక్కలు నాటి సంరక్షించాలని డీపీవో మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సిరిపురం గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి పనులను, పల్లె ప్రగతిలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటుతున్న మొక్కలను పరిశీలించారు. ఆయన వెంట డీఎల్పీవో అనిత, ఎంపీవో లక్ష్మీకాంత్, సర్పంచ్ మల్లయ్య ఉన్నారు.
పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి
మోమిన్పేట, జూన్ 7: మండల పరిధిలోని చీమలదరి, ఎన్కతల, మేకవనంపల్లి గ్రామా ల్లో పల్లె ప్రగతి పనులను డీపీవో మల్లారెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు అందంగా మారుతున్నాయన్నారు. అదే విధంగా మండల పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు చేపడుతున్న పనులను ఎంపీడీవో శైలజా రెడ్డి, ఎంపీవో యాదగిరి పరిశీలించారు.
అభివృద్ధిలో పోటీతత్వం ఉండాలి
బొంరాస్పేట, జూన్ 7 : గ్రామాలను అభివృద్ధి చేసుకునే విషయంలో సర్పంచ్లు పోటీత త్వంతో పని చేయాలని జడ్పీటీసీ సభ్యురాలు చౌహాన్ అరుణాదేశు అన్నారు. మంగళ వారం మండల పరిషత్ కార్యాలయంలో పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంపై నిర్వ హించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిలో అధికారులందరూ పాల్గొని సమస్యలను పరిష్కరించాలన్నారు. డీఎల్పీవో, మండల ప్రత్యేకాధికారి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామా ల్లో మార్పు వచ్చిందని, శానిటేషన్ నిరంతరం కొనసాగే కార్యక్రమమన్నారు.
మండల పరిధిలోని జాతీయ రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రజా ప్రతినిధులు దీనిని విజయవంతం చేయాలని కోరారు. గ్రామా ల్లో నిర్మించిన కంపోస్టు షెడ్లను సద్వినియోగం చేసుకోవాలని, శ్రమదాన కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వైకుంఠధామాలకు విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, ఎంపీడీవో పాండు పాల్గొన్నారు. కాగా చౌదర్పల్లి గ్రామంలో మంగళవారం సర్పంచ్ వెంకటమ్మ, మాజీ వైస్ ఎంపీపీ నారా యణరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని అంతర్గత రహదారులను శుభ్రం చేశారు. గుంతలు పడినచోట ట్రాక్టర్లతో మట్టిపోసి గుంతలను పూడ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తుల్జారెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు. అదేవిధంగా హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారికి ఇరువైపులా బుర్రితండా నుంచి రేగడిమైలారం వరకు గుంతలు తవ్వే కార్యక్రమం చురుకుగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమాన్ని మండల ప్రత్యేకాధికారి రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. గుంతలు తవ్వే పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
పనులను పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్
దోమ, జూన్ 7: మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో దోమ మండల స్పెషల్ ఆఫీసర్ కోటాజి, సర్పంచ్ శాంతాకొండారెడ్డితో కలిసి గ్రామంలో కొనసాగుతున్న పనులను పరి శీలిం చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం సంపూర్ణ అభివృద్ధి సాధించే దిశగా చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ నవాజ్రెడ్డి, టీఆర్ఎస్ యువ నాయకులు కొండారెడ్డి, హన్మంతు, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ప్రగతి పనులు ఎప్పటికప్పుడు రికార్డు చేయాలి
బంట్వారం, జూన్ 7 : పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన ప్రతి పనిని ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలని మండల ప్రత్యేకాధికారి నర్సింహులు సూచించారు. మంగ ళవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రత్యేకాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు నిర్ణయించిన పనులను గ్రామాల్లో చేపట్టాలన్నారు. వీధుల పరిశుభ్రత, తాగు నీరు సౌకర్యం, మురుగు కాలువల శుభ్రం, శిథిల భవనాలు, ఇండ్లను కూల్చి వేయడం లాంటి పనులు చేపట్టాలన్నారు. అలాగే శిథిలాస్థలో ఉన్న పాడుబడిన బావులను పూడ్చి వేయాలన్నారు. విద్యుత్ సౌకర్యం లేని చోట విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాలయ్య, గ్రామాల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
మరుగుదొడ్ల వాడకంపై అవగాహన
కోట్పల్లి, జూన్ 7: మండలంలోని నాగసాన్పల్లి గ్రామంలో ప్రత్యేక అధికారి చంద్రప్ప ఆధ్వర్యంలో సర్పంచ్ పద్మ, కార్యదర్శి కార్తీక్ ప్రజలతో కలిసి మరుగుదొడ్ల వాడకంపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలోని కాలనీల్లోని సీసీ రోడ్లపై చెత్తను తొలగిం చారు. మురుగు కాల్వలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి బాధ్యతగా ఐదు నుంచి పది మొక్కలు నాటాలని సూచించారు.
కొడంగల్ మండలంలో..
కొడంగల్, జూన్ 7: కొడంగల్ మండలంలోని ఆలేడ్ గ్రామంలో సర్పంచ్ విజయమ్మ, గ్రామ ప్రత్యేకాధికారి ఏపీవో రాములు గ్రామస్తులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. కార్య క్రమంలో పంచాయతీ సెక్రెటరీ రమేశ్రాథోడ్తో పాటు వార్డు సభ్యులు పాల్గొన్నారు.