వికారాబాద్, జూలై 22 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాల ఉత్పత్తుల పై జీఎస్టీ పెంచడం దుర్మార్గమని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. సామాన్య ప్రజల నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ప్రధాని మోదీ ఆదాని, అంబానీలకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వేస్తున్నారని ఆరోపించారు.
జీఎస్టీ పెంపుతో పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాండు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, కౌన్సిలర్లు అనంత్రెడ్డి, రామస్వామి, గోపాల్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.