వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ : 57ఏండ్లు నిండిన వారు ఆసరా పథకం కింద వృద్ధాప్య పింఛన్ల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య పింఛన్ వయస్సు 65 నుంచి 57 సంవత్సరాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడం అభినందనీయమన్నారు. దరఖాస్తుదా రుల పేరుపై మెట్ట భూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించిన వారు అర్హులు కారన్నారు.
కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలకు మించ కూడదన్నారు. ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాలు ఉన్నా పింఛన్కు అర్హులు కాదన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి 57 ఏండ్లు నిండిన వారు ఆసరాకు అర్హులని, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధులు పింఛన పొందుతున్న వారు అనర్హులని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ నెల 31వ తేదీలోగా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తుకు ఎలాంటి రుసుము ఉండదని తెలిపారు.