పరిగి : మట్టి వినాయక విగ్రహాలనే ఏర్పాటు చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం పరిగిలో పూడూరు జడ్పీటీసీ మేఘమాల ప్రభాకర్ గుప్తా దంపతుల ఆధ్వర్యంలో ఉచితంగా మట్టివినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి రసాయనిక పదార్థాలతో కాకుండా మట్టివినాయక విగ్రహాలతో చేసిన వినాయకులను ఏర్పాటు చేస్తే పర్యావరణ పరిరక్షణ ఏర్పడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఉచితంగా వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన పూడూరు జడ్పీటీసీ మేగమాల, ప్రభాకర్ గుప్తా దంపతులను అభినందించారు. కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ శ్యామ్సుందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, నార్మాక్స్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, టీఆర్స్నా యకులు పాల్గొన్నారు.