పరిగి : పరిగి కోర్టులో శనివారం నిర్వహించిన మెగా లోక్అదాలత్లో మొత్తం 478 కేసులు పరిష్కరించారు. పరిగి జూనియర్ సివిల్ జడ్జి భారతి ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిమినల్ కేసులు 121, సివిల్ కేసులు 3, లాక్డౌన్ కేసులు 229, బ్యాంకు కేసులు 12, ఎక్సైజ్ కేసులు 113 పరిష్కరింపబడ్డాయి. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాముయాదవ్, ఏజీపీ బాలముకుందం, ప్రధాన కార్యదర్శి గౌస్పాష, న్యాయవాదులు లింగం, నరేందర్యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, జయలక్ష్మీ, దామోదర్రెడ్డి, ఆనంద్గౌడ్, వెంకట్రాములు, నర్సింహరావు, కైసర్పాషా, శివారెడ్డి, విజయ్, కోర్టు సూపరింటెండెంట్ రవీందర్రెడ్డి పాల్గొన్నారు.