న్యూఢిల్లీ, జూలై 25: ఈ సంవత్సరం తక్కువ నిడివి గల రోజు ఆదివారం నమోదు కాబోతున్నది. మొత్తం 24 గంటల సమయంలో 0.65 మిల్లీ సెకన్లు తగ్గనున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది రెప్పపాటు కన్నా, కెమెరా ఫ్లాష్ కన్నా తక్కువ అని, దీనిని మనం గమనించలేమని తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా దాదాపు 36 లక్షల సంవత్సరాల తరువాత భూభ్రమణంలో మార్పు లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రపంచ గమన సమయాలను చూసే ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్, రెఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ (ఐఈఆర్ఎస్) తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం నిర్ణీత 24 గంటలు లేక 86,400 సెకన్లలో 0.65 మిల్లీ సెకన్లు తగ్గనున్నాయి. గత ఏడాది కూడా జూలై 10న 1.37 మిల్లీ సెకన్లు తగ్గాయని తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల హిమనీనదాలు, ధ్రువాల వద్ద మంచు పలకలు కరుగుతూ భూమి వేగం తగ్గుతున్నదని వివరించారు.