వికారాబాద్ : ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబిత ఇంద్రా రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా బోంరాస్ పేట మండలంలోని తుంకిమెట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పరిస్థితి ధీనంగామారిందన్నారు. వర్షాలకు తడిసి ధాన్యం మొలకలు వచ్చాయన్నారు.
సీఎం సొంత నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటో పెద్దె ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్మంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ , తదితరులు పాల్గొన్నారు.