పరిగి టౌన్ : పరిగి పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మొహర్రం వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి పాల్గొన్నారు. హిందూ ముస్లింలు కలిసి మెలిసి ప్రశాంతంగా పండుగలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో కూడా మొహర్రం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్కుమార్, వైస్ చైర్మన్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.