కులకచర్ల, జూన్ 22 : వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో జాతీయ ఆహారభద్రతా మిషన్ కింద మండలానికి 11.8 కింటాళ్ల విత్తనాలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా వచ్చిన వచ్చిన కంది విత్తనాలను ఎమ్మెల్యే రైతులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తుందన్నారు. వర్షాకాలం సీజన్లో రైతులకు అన్ని రకాల ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉంచామన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వ్యవసాయం పండుగల మారిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యాహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, మండల వ్యవసాయాధికారి వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.