మహేశ్వరం : బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు. బుధవారం మహేశ్వరం మండల పరిధిలోని ఉప్పుగడ్డ తండాకు చెందిన కాంగ్రెస్ (Congress), బీజేపీ(BJP) నాయకులు బీఆర్ఎస్ (BRS) లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల మాటలను ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. రోజుకో హామీతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్(CM KCR) అభ్యర్థులను ప్రకటించిన తరువాత ప్రతి పక్ష నాయకులు (Opposition Leaders) గందరగోళంలో పడ్డారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి (Development) చెందుతుందని అన్నారు. సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్గా నిలుస్తుందని, వీటిని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా (Telangana Model) తీసుకుంటున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, సేవాలాల్ దేవాలయ చైర్మన్ సీతారాం నాయక్, రవీందర్నాయక్, సురేశ్ నాయక్, గ్రామ సర్పంచ్ నేజి రెడ్యానాయక్, కళ్యాణ్ నాయక్, మాజీ జడ్పీటీసీ ఈశ్వర్నాయక్, నేనావత్ రాజునాయక్, దేశీయ రాజ్కుమార్ , నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో
కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు వత్యావత్ మోహన్నాయక్, వార్డు సభ్యుడు, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు నేనావత్ రమేశ్ నాయక్, యువ నాయకులు వత్యావత్ రాజునాయక్, నేనావత్ సేవియా నాయక్, తులసిరామ్ నాయక్, సీనియర్ నాయకులు శంకర్నాయక్, సోమల నాయక్, సంజు నాయక్, బాలు, లోకేశ్, శివ, రాజేశ్, పీరియ, శ్రీను, మాతృ, గణేశ్, మహేశ్, వినోద్, వెంకటేశ్, రవీందర్, శివనాయక్, రాజేశ్ నాయక్ తదితరులు ఉన్నారు.
నాగిరెడ్డి పల్లి గ్రామంలో ఎంపీటీసీ రమేశ్, సొంటి నర్సింహ, పక్కీర, కొండూరి సంజీవ, కాంగ్రెస్ వార్డు సభ్యులు కొండూరి నందు, రఘు తదితరులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవులా నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.