న్యూఢిల్లీ: ఈ నెల 15న 80వ స్వాతంత్య్ర వేడుకల్లో ఈ సారి ఓ ప్రత్యేకత నెలకొంది. ఎర్రకోటపై జరిగే వేడుకల్లో తొలిసారి వందేమాతరం గీతాన్ని ఆలపిస్తారని రక్షణశాఖ సోమవారం తెలిపింది. స్వాతంత్య్ర వేడుకల్లో ఎర్రకోటపై వందేమాతరాన్ని ఆలపించడం చరిత్రలో ఇదే మొదటిసారి అని వెల్లడించింది. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వందేమాతరానికి స్వాతంత్య్ర పోరాటంలో కీలక గుర్తింపు ఉందని.. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రక్షణశాఖ వెల్లడించింది. ఇటీవల పార్లమెంట్లో వందేమాతరంను రక్షించే కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది.