కోదాడ, ఆగస్టు 27 : ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని ఆరోపిస్తూ గురువారం కోదాడకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మాదల ఉపేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకేమీ తెలియదని.. సోషల్ మీడియాలో వస్తే ఆ పోస్టులను ఫార్వర్డ్ చేశాను అని ఉపేందర్ చెప్పినప్పటికీ వినకుండా పోలీసులు పదే పదే ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. లష్కర్ ఉద్యోగాల్లో ముడుపులు తీసుకున్నది ఎవరు..
అమ్మగారి హుండీ అని పొందవపర్చిన పోస్టులో ఆ అమ్మ ఎవరో చెప్పాలని, బర్ల దొంగతనంలో ముడుపులు తీసుకున్నది ఎవరో చెప్పాలని ఉపేందర్పై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. అతడిపై ఎఫ్ఐఆర్ చేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది.. నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని ఈ రాత్రికి ఇంటికి పంపాలని, తెల్లారి వచ్చి సమాధానం ఇస్తాడని స్థానిక న్యాయవాదులు పాలేటి నాగేశ్వరరావు, ఎడ్లవల్లి వెంకటేశ్వరరావు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఉపేందర్ను వేధిస్తే సహించమని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ హెచ్చరించారు.