బంట్వారం(కోట్పల్లి), అగష్టు 28: నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. కాగా, కోటపల్లి వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం కోట్పల్లి గ్రామానికి చెందిన చాకలి సంగమేశ్వర్ బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాగులోకి వెళ్లి గల్లంతయ్యాడు. ఎంత చూసిన ఆచుకీ లభ్యం కాకపోవడం సంగమేశ్వర్ భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వెంటనె పోలీసులు రంగప్రవేశం చేసి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం సైతం రెండు బోట్లలో సుమారు 8 మంది గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. అయిన సాయంత్రం వరకు ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదని ఎస్ఐ శైలజ తెలిపారు. ఆచూకీ తెలుసుకునేందుకు తాము నిరంతరంగా గాలింపు చేపడుతున్నామని, వాగులోనే కాక ప్రాజెక్టు పరిసరాల్లో సైతం గాలింపు చేపడుతున్నామని ఎస్ఐ తెలిపారు.