మర్పల్లి/వికారాబాద్ : అపోహలు వీడి ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని నర్సాపూర్ గ్రామంలో మీతో నేను కార్యక్రమంలో పాల్గొని గ్రామంలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. అలాగే గ్రామంలో, పొలాల వద్ద వేలాడుతున్న వైర్లను వెంటనే సరిచేయాలని, అవసరం ఉన్నచోట నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆయా శాఖల అధికారులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. గ్రామంలో మురుగు కాలువలు, రోడ్లు పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుధ్యానికి నికి ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. అదే విదంగా ప్రతి ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు.
కార్యక్రమంలో సర్పంచ్ పుష్పలత, ఎంపీటీసీ రవీందర్, జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మల్లేశం, రైతు బంధు మండలాధ్యక్షుడు నాయబ్గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.