పరిగి, ఆగస్టు 14 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నాయకులు చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం పరిగిలోని ఎమ్మెల్యే నివాసంలో పరిగి మండలం నారాయణపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జి.వెంకటయ్య, వార్డుసభ్యులు పొట్ట రవి, బ్యాగరి సాయిలు, నాయకులు పి.అనంతయ్యతోపాటు 100 మంది, రాంరెడ్డిపల్లికి చెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ర్టాలలో ఆ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. రాబోయే రోజులలో టీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కరణం అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.