చేవెళ్లటౌన్ : చేవెళ్లలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నెల రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంటలు వాడిపోవడంతో రైతులు దిగలు చెందారు. వర్షాం కురవడంతో పంటకు ప్రాణం పోసినట్లు అయిందని రైతులు చెబుతున్నారు. వర్షం కురవడంతో కంది, జొన్న, పత్తి తదితర పంటలకు ఎంతో మేలు అయిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.