హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిశాడు. పొంటెవెడ్రా ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్షిప్లో కాంస్య పతకం గెలిచాడు. స్పెయిన్లోని పొంటెవెడ్రాలో జరిగిన ఈ టోర్నీలో రిత్విక్ తొమ్మిది రౌండ్లలో ఐదు విజయాలు, నాలుగు డ్రాలతో మొత్తం 7 పాయింట్లు సాధించి మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. భారత్కే చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ ముత్తయ్య, క్యూబా ప్లేయర్ రొడ్రిగెజ్ లూయిస్ కూడా ఏడు పాయింట్లు సాధించారు. అయితే టై బ్రేక్ స్కోరులో ముత్తయ్య (44.67) స్వర్ణం అందుకోగా.. రొడ్రిగెజ్ (46) రజతం, రిత్విక్ (44.11) కాంస్యం ఖాతాలో వేసుకున్నారు.