కొడంగల్, ఎప్రిల్ 20 : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి తెలిపారు. ఆదివారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరిపతి సంఘం లి. హస్నాబాద్ ఆధ్వర్యంలో కొడంగల్, పెద్ద నందిగామ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి రైతులకు ఇబ్బందులు లేని విధంగా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని లాభాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేష్రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షులు కటకం శివకుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నందారం ప్రశాంత్, టీపీసీసీ ప్రతినిధి మహమ్మద్ యూసూఫ్తో పాటు చిదిరి వినోద్, శంకర్నాయక్, కేవీ రాజేందర్, సంజీవ్రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.