పరిగి, ఆగస్టు 3 : బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. బుధవారం పరిగి పట్టణంలోని 5వ వార్డు మందుల కాలనీలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బీసీ కమ్యూనిటీహాల్ నిర్మాణం ద్వారా అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు.
అన్ని కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సర్కారు భూమి కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. పరిగి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ చైర్మన్ సురేందర్, మాజీ ఎంపీపీ కల్లు శ్రీనివాస్రెడ్డి, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.