ధారూరు, జూలై 11 : దళితుల అభ్యున్నతికిరాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో ధారూరు మండల పరిధిలోని మోమిన్కలాన్ గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారుడు రాకేష్కు కారును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దేశంలో ఇలాంటి పథకం మరెక్కడా లేదన్నారు. దశలవారీగా దళితబంధును అందరికి వర్తింపజేస్తామని ఆయన స్పష్టం చేశారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రాజునాయక్, దేవేందర్, మాణిక్యం, మాణిక్ప్రభు, ఇస్మాయిల్,శ్రీనివాస్, సంతోష్కుమార్, రాజుగుప్త, విజయ్కుమార్, తదితరులు ఉన్నారు.