పరిగి : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. కులకచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన బృంగి హరికృష్ణకు గురువారం పరిగిలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతును రాజును చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. మార్కెట్ పాలకవర్గం రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పరిగి మార్కెట్ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, కులకచర్ల ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, పీరంపల్లి రాజు, నాగరాజు, సర్పంచ్ వెంకట్రాంక్రిష్ణారెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.