పరిగి, జూన్ 9 : పరిగి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. గురువారం పరిగిలోని 15వ వార్డులో నిర్మాణం చేపట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి వార్డులో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
ప్రధానంగా అన్ని కాలనీలలో రోడ్లు, మురికికాలువల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. పట్టణ ప్రగతిలో ప్రజలందరు భాగస్వాములై తమ కాలనీలు మరింత అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. పరిగిలో పట్టణ ప్రగతి ద్వారా పలు పనులు చేపట్టామన్నారు.
ప్రతి వార్డులో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు వెంటనే స్థలాలు గుర్తించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. మరిన్ని అభివృద్ది పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కె.అరవిందరావు, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్, కౌన్సిలర్లు వేముల కిరణ్, మునీర్, వెంకటేశ్, నాగేశ్వర్రావు, కో-ఆప్షన్ సభ్యుడు ముకుంద శేఖర్ తదితరులు పాల్గొన్నారు.