ధారూరు,ఆగస్టు 05 : పేద ప్రజలకు కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేసుకునే వెసులు బాటు కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధిఎంతగానో ఉపయోగపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
శుక్రవారం ధారూరు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 11మంది లదారులకు రూ.5,90,000 విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్శంగా సీఎం ఆర్ఎఫ్ నిధులతో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నారు.
కార్యక్రమంలో ధారూరు రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు వెంకటయ్య, ఏఎంసీ చైర్మన్ సంతోష్కుమార్,నాయకులు అనంతయ్య, చంద్రయ్య, శ్రీకాంత్ రెడ్డి, యాత్రగౌడు,తదితరులు పాల్గొన్నారు.