పరిగి : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడవసారి అధికారంలోకి రావడం ఖాయమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి (MLA Koppula Maheshreddy) ధీమా వ్యక్తం చేశారు. పరిగి గడ్డపై మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని అన్నారు. గురువారం పరిగిలో చౌడాపూర్ మండలం మందిపల్ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ సునీత బాల్రాజ్తో పాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ (BRS) లో చేరారు.
ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలోని ప్రభుత్వం దేశానికే తలమానికంగా నిలిచే విధంగా సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేయడం ద్వారా ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని అన్నారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, ఇతర సదుపాయాల కల్పనకు విశేష కృషి జరుగుతుందని చెప్పారు.
తద్వారా ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరుస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో విజయంతో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్(Hatrick) సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన వారు
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన గౌరీశంకర్, మహేశ్, నరేష్, తిరుపతి, దశరథం, వెంకటేశ్, శ్రీశైలం, యాదగిరి, రాజు, రాజశేఖర్, రమేష్, శ్రీకాంత్, భీమయ్య, చెన్నయ్య, పెంటయ్య, లక్ష్మయ్యలతోపాటు మరో రెండు వందల మంది బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
,