వికారాబాద్, మే 3 : సమాజ మార్పుకు మార్గదర్శకుడు మహాత్మా బసవేశ్వరుడని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం బసవేశ్వరుని జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని ఎంఆర్పీ చౌరస్తా వద్ద ఉన్న బసవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. కుల, మతాలకు అతీతంగా సమాజాభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు బసవేశ్వరుడని కొనియాడారు. సామాజిక వ్యవస్థలో సమానత్వం ఉండాలని, కులమతాలు, మనుషుల మధ్య సామరస్యం ఉండాలని ఆకాంక్షించిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడని తెలిపారు.
నేటి పార్లమెంటరీ వ్యవస్థకు ప్రతీకగా నిలిచే అనుభవ మండపాన్ని ఆనాడే స్థాపించి కుల, మత, జాతి, వర్గ, వర్ణ బేధాలు లేకుండా అందరికీ అవకాశం కల్పించారని గుర్తు చేశారు. బసవేశ్వరుడి ప్రవచనాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ముద్ద దీప, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కమాల్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, కౌన్సిలర్లు అనంత్రెడ్డి, సురేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.