Victim | వికారాబాద్లో ఓ కేసు విషయంలో పోలీసుల వ్యవహార శైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన ఓ చిన్న ఆక్సిడెంట్ కేసులో బాధితుడిని పోలీసులు జైలుకి పంపారు. అంతేకాదుఆక్సిడెంట్ కేసు అయితే పోలీసులు బాధితుడిపై పోలీసులు అటెంప్ట్ టూ మర్డర్ కేసు పెట్టడం గమనార్హం.
ఈ క్రమంలో మాకు ఎవరితో గొడవలు లేవని బాధితుడు, బాధితుడి కుటుంబం పేర్కొంటుండగా.. మరోవైపు పోలీసులు పాత కక్షలు కారణం అంటున్నారు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై బాధితుడి కుటుంబం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.