ధారూరు, ఆగస్టు 02: గ్రామంలో ప్రతి ఇంటికి సరిపడా మిషన్ భగీరథ నీళ్లు అందించాలని సంబంధిత అధికారులను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశించారు. మంగళవారం మీతో నేను అనే కార్యక్రమంలో భాగంగా ధారూరు మండలం హరిదాస్ పల్లిలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలో మిషన్ భగీరథ నీరు రాని సమయంలో ప్రత్యామ్నాయంగా నీరు అందించే ఎర్పాటు చేయాలని సూచించారు. గ్రామంలో రెండు నెలలుగా నీటి సరఫరా ఆగిపోతే మిషన్ భగీరథ అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులు వెంటనే హరిదాస్ పల్లి గ్రామాన్ని సందర్శించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.
మైలారం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తతండాకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజునాయక్, ప్రధాన కార్యదర్శులు కావలి అంజయ్య, రాజుగుప్తా, మాజీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.