మర్పల్లి, జూలై 1 : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మర్పల్లి మండలంలోని బూచన్పల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ విజేందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సోమిరెడ్డి, లక్ష్మణ్రావు, మహేందర్, బక్కప్ప, జనార్దన్ రెడ్డి, అశోక్, శ్రీనివాస్, శ్రీకాంత్తో పాటు మరో 15 మంది నాయకులు శుక్రవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామన్నారు.
పార్టీ ప్రతిష్టకు మరింత కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, ప్రధానకార్యదర్శి మధుకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.