పరిగి : రైతుబంధు పథకం రైతాంగానికి ఎంతో ఆసరాగా నిలిచిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. రైతులకు పంటల సాగుకు పెట్టుబడి సహాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. రైతుబంధు వారోత్సవాలలో భాగంగా బుధవారం పరిగి మండలం గోవిందాపూర్ శివారులోని రైతు గఫార్ పొలంలో వరి నాట్లను రైతుబంధు, కేసీఆర్ అంటూ ఆంగ్ల అక్షరాలలో వేయడం జరిగింది. ఇందులో జిల్లా వ్యవసాయాధికారి గోపాల్తో కలిసి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుబంధు పథకం ద్వారా రైతులందరూ సంతోషంగా పంటలు సాగు చేసుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధుతో అప్పుల కోసం ఎదురుచూడకుండా రైతులు పంటల సాగు చేపడుతున్నారని అన్నారు.
8 విడతలుగా ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం అందజేస్తుందని, ఈసారి పెట్టుబడి సహాయం రూ. 50వేల కోట్లు దాటుతుందని చెప్పారు. రైతులందరూ సంతోషంగా రైతుబంధు సంబురాలలో పాల్గొంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మార్కెట్ చైర్మన్ సురేందర్, పీఎసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేందర్, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ వెంకటయ్య పాల్గొన్నారు. పరిగి మండలం రాఘవాపూర్ గ్రామంలో రైతులతో కలిసి సర్పంచ్ నల్క జగన్, పీఏసీఎస్ డైరెక్టర్ హన్మంత్రెడ్డిలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.