బొంరాస్పేట : హరితహారంలో నాటిన ప్రతి మొక్క బతకాలని ఇందుకోసం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని డీఆర్డీవో కృష్ణన్ అన్నారు. గురువారం మండలంలోని బురితం డా పరిధిలో జాతీయ రహదారికి ఇరువైనులా నాటిన మొక్కలను(ఎంఎల్ఏపీ), దుద్యాల గ్రామంలో పల్లె ప్రకృతి వనం, బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను ఆయన పరిశీలించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎల్ఏపీ ప్లాంటేషన్ బాగుందని, మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీళ్లు పోయాలని సూచించారు. దుద్యాల బృహత్ పల్లె ప్రకృతి వనంలో 30 వేల మొక్కలు నాటాల్సి ఉండగా ఇత వరకు 10 వేలు మాత్రమే నాటారని, మిగ తా మొక్కలను త్వరగా నాటి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
వచ్చే ఏడాది హరితహారానికి నర్సరీ పనులను త్వరగా ప్రా రంభించి ఈ నెలాఖరులోగా బ్యాగుల్లో విత్తనాలు నాటే పనులను పూర్తి చేయాలని డీఆర్డీవో సూచించారు. ఆయన వెంట దుద్యాల సర్పంచ్ మహ్మద్ ఖాజా, ఎంపీడీవో మోహన్రాజ్, ఏపీవో మల్లికార్జున్, ఈసీ ఇలియాస్ పాల్గొన్నారు.