వికారాబాద్, జూలై 30: చాలా మంది చిన్నారులు సెల్ఫోన్లకు అలవాటు పడుతున్నారు. కరోనా కారణంగా పాఠశాలలు మూసి ఉండటంతో శారీరకంగా ఆడే ఆటలకు దూరమవుతున్నారు. వికారాబాద్ మున్సిపల్ 28వ వార్డులోని చౌదరి కాలనీలో చిన్నారులు ఆడుకునేందు ఒక పార్కును ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ స్వాతి రాజ్కుమార్ ముందుకొచ్చారు. పార్కు అభివృద్ధికి నెల రోజుల పాటు విశేషంగా కృషి చేశారు. పార్కులో చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులతో పాటు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటుచేశారు. హరితహారంలో భాగంగా వివిధ రకాల మొక్కలు నాటి, వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక చొరవ తీసుకొని డ్రిప్ సహాయంతో ప్రతి మొక్కకు నీరందేలా చూస్తున్నారు. మున్సిపల్ నిధులు రూ.7 లక్షలు ఖర్చు చేయడంతో పార్కుకు కొత్త రూపం వచ్చింది. పారిశుధ్య కార్మికులు పార్కులోని చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. ఈ పార్కును శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల ప్రారంభించనున్నారు.
కాలనీవాసుల సహకారంతో పార్కు ఏర్పాటు చేశాం
చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలను కాలనీవాసుల సహకారంతో పరిష్కరించాం. చిన్నారులు ఆడుకునేందుకు పార్కు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరారు. ఇందుకు వికారాబాద్ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్ సహకారం అందించారు. 500 గజాల్లో పార్కు ఏర్పాటు చేశాం. పార్కు అభివృద్ధికి రూ.7లక్షల వరకు ఖర్చుచేశాం.