కులకచర్ల, మే 2 : కులకచర్ల మండల కేంద్రంలో గురువారం చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కోసం గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ తెలంగాణలో అత్య ధిక పార్లమెంటు స్థానాలను గెలిస్తే కేంద్రంలో మళ్లీ బీఆర్ఎస్ హవా ఉం టుందని పేర్కొన్నారు.
బీసీ ముదిరాజ్ వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపిస్తే మన ప్రాంత సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కులకచర్ల మాజీ ఎంపీటీసీ మాలె కృష్ణయ్యగౌడ్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భృంగి శ్రీశైలం, మాజీ అధ్యక్షుడు సత్తయ్య, నాయ కులు జెట్టిగాళ్ల వెంకటయ్య, లక్ష్మయ్య, అంజయ్య, రుక్మొద్దీన్, కృష్ణయ్య, రమేశ్, బిచ్చయ్య, కాంగారి బాలు, నసీర్, కటికె నరేశ్, సయ్యద్ పాల్గొన్నారు.
మర్పల్లి: చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా గురువారం మండల కేంద్రంలో జడ్పీటీసీ మధుకర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చిందని ఆరోపించారు.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందటంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు.. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ గఫార్, రమేశ్ మిత్ర, ఖాజా తదితరులు పాల్గొన్నారు.