ఆమనగల్లు, మే 2 : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఆమనగల్లు మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన గిరిజన గర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముం దుగా పట్టణంలోని సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం జాతీయ రహదారి గుండా ర్యాలీ నిర్వహించి శ్రీలక్ష్మి గార్డెన్లో జరిగిన కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ.. అప్పటి సీఎం కేసీఆర్ సహకారంతో గురుకులాల కార్యదర్శిగా పనిచేసి 10 లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపినట్లు.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలవాత్ పూర్ణలాంటి ఎంతోమంది బిడ్డల ను ప్రయోజకులుగా తీర్చిదిద్దినట్లు గుర్తు చేశారు.
పదవీ కాలం ఏడేండ్లు ఉన్నా ప్రజాసేవే పరమావధిగా భావించి పదవికి రాజీనామా చేశానన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం కాగానే తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనుల చిరకాల కోరికను నెరవేర్చారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయన్నారు.
తాగు, సాగు నీరుతోపాటు విద్యుత్తు కోతలతో మహిళలు, అన్న దాతలు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. మే 13న జరుగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే అన్ని వర్గాలకు అండగా ఉండడంతోపాటు నాగర్కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ విద్యావంతుడైన ఆర్ఎస్పీని గెలిపించాలని ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. పార్లమెంట్లో మన వాణిని వినిపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా రన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి చాడ కిషన్రెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్చార్జి అభిలాష్రావు, గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యానాయక్, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, జడ్పీటీసీలు అనురాధ, దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, మున్సిపల్ చైర్మన్ సత్యం, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ,బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దోనాదుల కుమార్, ఎంపీటీసీ సరిత, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు అర్జున్రావు, జైపాల్రెడ్డి, శంకర్, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్, కౌన్సిలర్ రాధమ్మ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఖలీల్, శ్రీనివాస్, రఘు, శ్రీనివాస్ యాదవ్, చందు, సుభాష్, ప్రసాద్, వెంకటేశ్, సతీశ్, రమేశ్నాయక్, సైదుల్గౌడ్, యాదయ్య, కిరణ్ కుమార్, రంజిత్, అబ్బు, హనీఫ్, శివ తదితరులు పాల్గొన్నారు.