వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడకుండా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జి ల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరాకు అంతరా యం కలుగకుండా గ్రామీణ నీటి సరఫరా అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశారు. గత వారం రోజులుగా పంచాయతీల్లో తా గునీటి సరఫరాపై పూర్తి వివరాలు సేకరించి ప్రణాళికను రూపొందిం చారు. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోతే వెంటనే ప్రత్యామ్నాయంగా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా మిషన్ భగీరథకు ముందు గ్రామాల్లో ఉన్న పంపుసెట్లకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన వివరాలను సంబంధిత అధికారులు సేకరించి అంచనాలను రూపొందించారు.
వికారాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులనూ కేటాయించింది. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో జాడలేని సమ్మర్ యాక్షన్ ప్లాన్ను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చింది. ప్రజల తాగునీటి అవస్థల ను తీర్చేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేసి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో ఏనాడు కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్లను అధికారులు రూపొందించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ల రూపకల్పనతో మళ్లీ తాగునీటి కష్టాలొస్తాయేమోననే ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో వేసవిలో తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు రూ.5.51కోట్లతో జిల్లా మిషన్ భగీరథ అధికారులు యా క్షన్ ప్లాన్ను సిద్ధం చేశారు. గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సంబం ధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు పరిగి సబ్ డివిజన్కు రూ.1.30 కో ట్లు, కొడంగల్ సబ్ డివిజన్కు రూ.1.04 కోట్లు, తాండూరు సబ్ డివిజన్కు రూ.1.62 కోట్లు, వికారాబాద్ సబ్ డివిజన్కు రూ.1.54 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు.
జిల్లాలోని 566 పంచాయతీల్లోని 1446 వాటర్ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయడంతోపాటు నీటిలో బ్లీచింగ్ వేసేందుకు రూ.1.14 కోట్లు , పైపులైన్ల లీకేజీల మరమ్మతులకు జిల్లావ్యాప్తంగా రూ.2.39 కోట్లు అవసరమని అంచ నా వేసిన అధికారులు పరిగి నియోజకవర్గానికి రూ. 54.83లక్షలు, కొడంగల్ సబ్ డివిజన్కు రూ.51.15లక్షలు, తాండూరు సబ్ డివిజన్కు రూ.63.15లక్షలు, వికారాబాద్ సబ్డివిజన్కు రూ.70.1 లక్షలు అవసరమని యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశారు.
అదేవిధంగా జిల్లాలో 3,360 పంపుసెట్లు ఉండగా, వీటిలో పరిగిలో 1,176, కొడంగల్ సబ్డివిజన్లో 434, తాండూరు సబ్ డివిజన్లో 1008, వికారాబా ద్ సబ్డివిజన్లో 742 పంపుసెట్లు ఉన్నాయి. జిల్లాలో పాడైన పంపుసెట్లకు మరమ్మతులు చేసేందుకు రూ.1.97 కోట్లు అవసరమని అంచనా వేయగా వాటిలో పరిగికి రూ.60.40 లక్షలు, కొడంగల్ సబ్ డివిజన్కు రూ.21.70 లక్షలు, తాండూరు సబ్ డివిజన్కు రూ.56.25 లక్షలు, వికారాబాద్ సబ్ డివిజన్కు రూ.59.55 లక్షలు అవసరమని అధికారులు తేల్చి చెప్పారు. నవాబుపేట, మర్పల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. వేల కోట్లు ఖర్చు చేసి శ్రీశైలం నుంచి తాగునీటిని తీసుకొచ్చి ప్రజల దాహార్తిని తీర్చింది. మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో తాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్ పడడంతోపాటు ఇంటి వద్దే నల్లాల ద్వారా తాగునీరు అందుతున్నది. మిషన్ భగీరథ లో భాగంగా జిల్లాకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తాగునీరు అందు తున్నది. 230కిలోమీటర్ల దూరంలోని కొల్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోస్తూ జిల్లాలోని రాఘవపూర్, కొడంగల్లోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు సరఫరా చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా మిషన్ భగీరథ పనుల్లో భాగంగా రూ.1,070 కోట్లతో ప్రధాన పైపులైన్లు, ఓహెచ్బీఆర్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం, రూ.413 కోట్ల తో ఇంట్రా విలేజ్ పనులు పూర్తి చేసి తాగునీటిని అందిస్తున్నారు. అయితే వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని 971 ఆవాసాలకు, 1,98,162 కుటుంబాలకు ఇంటింటికీ నల్లా ల ద్వారా భగీరథ నీరు సరఫరా జరుగుతున్నది. జిల్లాలో తాగునీటిని అందించేందుకు 1,920 కిలోమీటర్ల పైపులైన్, 874 ఓహెచ్ఎస్ఆర్లు నిర్మించారు.