ధారూరు : రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర సమితిలోనే సాధ్యమని, అబివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చూసి భారీగా టీఆర్ఎస్ పార్టీలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు చేరుతున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం ధారూరు మండల పరిధిలోని మున్నూర్ సోమారం, కాచారం గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు 50 మందికి పైగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అంతకుముందు గ్రామానికి విచ్చేయుచున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మండల పార్టీ నాయకులకు డప్పులతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చూసి మరింత అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్న కార్యకర్తలకు స్వాగతం తెలుపుతూ ప్రతి ఒక్కరూ పార్టీ ప్రతిష్టతకై కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో ధారూరు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజునాయక్, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు వెంకటయ్య, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, మాజీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ సంతోష్కుమార్, మండల పార్టీ నాయకులు కావాలి అంజయ్య, రాములు, చెన్నయ్య గౌడ్, రాంచంద్రారెడ్డి, నర్సింలు, అంజయ్య, నర్సింలు, బీంసేన్ చారి, సాయన్న, అనంతయ్య, రాములు, రవి, చుక్కయ్య, సంగయ్య, బిచ్చయ్య, శ్రీశైలం, దశరత్, శేఖర్ పాల్గొన్నారు.