వికారాబాద్, జనవరి 5: ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఎలాంటి తప్పులు దొర్లకుండా వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీ నమోదుపై శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన దరఖాస్తులను వెబ్సైట్లో నమో దు చేసేందుకు 57 టీమ్లను ఏర్పాటు చేశామని, ప్రతి టీమ్ లో 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లు ఉంటారన్నారు.
అన్ని మండల కేంద్రాల్లో సెంటర్లను ఏర్పాటు చేశామని, ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో 10 మంది చొప్పున డాటా ఎంట్రీ చేయాలన్నారు. పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా పనులు చేపట్టాలని, ఒక్క టీమ్ ప్రతిరోజు వెయ్యి దరఖాస్తులను అప్లో డ్ చేయాలని, ఈనెల 17 వరకు పూర్తి చేయాలని సూచించారు. ఆధార్, రేషన్ కార్డు, సెల్ నంబర్లను పూర్తి జాగ్రత్తతో తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. ఆన్లైన్లో ఒక దరఖాస్తు అప్లోడ్ చేసేందుకు రూ.5, భోజనం, నీటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఎంట్రీ చేసిన దరఖాస్తులు గల్లంతు కాకుండా పూర్తి జాగ్రత్త వహించి భద్రపరచాలన్నారు. దరఖాస్తు నమోదు చేసిన తర్వాత వచ్చే యూనిక్ నంబర్ను రెడ్ పెన్నుతో దరఖాస్తు పైభాగంల రాసి, దరఖాస్తు చివరి భాగం లో ఎంట్రీ చేసిన ఆపరేటర్ పేరు సంతకం చేయాలని సూచించారు.
శనివారం (నేడు) మధ్యాహ్నం నుంచి పనులు ప్రారంభించాలని అన్ని సెంటర్లలో అవసరమైన స్పీడ్గా పనులు పూర్తి చేసేందుకు ఇంటర్నెట్ సదుపాయం, విద్యుత్తు సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఈ డాటా ఆధారంగానే లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో చేపట్టిన డాటా ఎంట్రీ పనులను మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్తో కలిసి కలెక్టర్ పరిశీ లించారు. అనంతరం డాటా ఎంట్రీ ఆపరేటర్ల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమా ర్, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.