పరిగి : కులకచర్ల మండల కేంద్రానికి చెందిన ఆలేటి సాయిలు కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. సమస్య ఎక్కువ కావడంతో చికిత్స నిమిత్తం ఓ దవాఖానలో చేరాడు. దవాఖాన ఖర్చుల కోసం ఎమ్మెల్యే సహకారంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ఎల్వోసి చెక్కు మంజురు అయింది. మంజూరైన ఎల్వోసిని బుధవారం పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి లబ్ధిదారుడికి అందజేవారు. కార్యక్రమంలో పరిగి, కులకచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్లు సురేందర్, బృంగి హరికృష్ణ, నాయకుడు మాలె కృష్ణగౌడ్ పాల్గొన్నారు.