వికారాబాద్, జూన్ 18: ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మిషన్ భగీరథ నీళ్లు తాగాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచినీళ్ల దినోత్సవాన్ని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు పరిశీలించిన తరువాతే మిషన్ భగీరథ నీటిని ఇంటింటికీ సరఫరా చేస్తున్నామన్నారు. వాటర్ ట్యాంకులను శుభ్రంగా ఉంచుకోవడం, లీకేజీలు లేకుండా చూసుకోవాలన్నారు.
మినరల్ వాటర్లో లవణాలు పోయి ఉత్త నీళ్లే ఉంటాయని, వాటిని తాగితే కీళ్ల నొప్పులు, కళ్లనొప్పులు తదితర సమస్యలు వస్తాయని వివరించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాఘవపూర్ వద్ద మిషన్ భగీరథ నీరు శుద్ధి చేసే కేంద్రం ఉందన్నారు. దాని ద్వారా నీటిని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ నీరు తాగితే ఎలాంటి రోగాలు రావన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజుల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మిషన్ భగీరథ నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్బేగం, డీటీడీవో కోఠాజీ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, కౌన్సిలర్లు అనంత్రెడ్డి, రామస్వామి, కృష్ణారెడ్డి, కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, నాయకులు లక్ష్మీకాంత్రెడ్డి, విజయ్కుమార్, మున్సిపల్ అధికా రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
‘మిషన్ భగీరథ’ విజయవంతం
కొడంగల్, జూన్ 18: మిషన్ భగీరథ పథకం సఫలీకృతమై తాగునీటి కష్టాలు తొలి గినట్లు మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్, దశాబ్ది ఉత్సవాల ప్రత్యేకాధికారి, డీఆర్డీవో కృష్ణన్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో మంచి నీళ్ల పండుగను స్థానిక మిషన్ భగీరథ గ్రిడ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తాగునీటి కష్టాలను తీర్చేందుకు సీఎం కేసీఆర్ దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని శ్రీశైలం నుంచి కృష్ణా బ్యాక్వాటర్ను పైప్లైన్ల ద్వారా ఈ ప్రాంతానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రత్యేకంగా మిషన్ భగీరథ గ్రిడ్లను ఏర్పాటు చేసి ఐదు దశల వారిగా నీటిని శుధ్ధి చేసి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
మార్కెట్లో కొనుగోలు చేసే మినరల్ వాటర్ కంటే వంద శాతం మిషన్ భగీరథ నీళ్లు నాణ్యమైనవన్నారు. మిషన్ భగీరథ అందుబాటులోకి వచ్చిన తరువాత డయేరియా తదితర రోగాలు పూర్తిగా నివారణ అయినట్లు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉషారాణి, దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్, ఎంపీపీ విజయ్కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్రావు యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను అపర భగీరథుడిగా కొనియాడారు. ప్రతి వ్యక్తికీ ప్రతి రోజూ వంద లీటర్ల నీరు సరఫరా అవుతుందని, నీటిని వృథా చేయ కుండా, అవసరం మేరకు వాడుకోవాలని కోరారు. అనంతరం పాల్గొన్న విద్యా ర్థులు, ఆయా గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. మిషన్ భగీరథ సిబ్బంది అందించిన సేవలకు గాను ఉత్తమ అవా ర్డులను అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఎంపీడీవో పాండు, మిషన్ భగీరథ డీఈ శశాంక్ మిశ్రా, ఏఈ హుస్సేన్లతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య ప్రదాయిని మిషన్ భగీరథ..
మిషన్ భగీరథ నీళ్లు చాలా శ్రేష్ఠమైనని,, చెరువులు, బావులు, కుంటల్లో నీరు అప్పట్లో తాగడం వల్ల అనేక అంటురోగాలు వచ్చేవి. నేడు అటువంటి పరిస్థితి లేదు. దీనికి కారణం మిషన్ భగీరథ నీళ్లే. కృష్ణా నదీ జలాలను సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఐదు విధాలుగా శుద్ధి చేసి ప్రభుత్వం ఇంటింటికీ సరఫరా చేస్తున్నది. మన ఆరోగ్యానికి సరిపడా మినరల్స్ ఇందులో పుష్క లంగా ఉన్నాయి. మార్కెట్లో లభించే బాటిల్ నీళ్లు తాగడం వల్ల ఎటు వంటి ప్రయోజనం ఉం డదు. కేవలం దాహాన్ని తీర్చుకోవడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి. అపోహ పడకుండా ప్రతి ఒక్కరూ మిషన్ భగీరథ నీటిని తాగాలి. తమ చిన్నారుల ఉజ్వల ఆరోగ్యానికి మిషన్ భగీరథ నీటిని తాగించండి.
– నవనీత, ఇంటర్ ప్రథమ సంవత్సరం, ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాల, కోకట్, తాండూరు