మంచాల, జనవరి 4 : మండల కేంద్రంలోని ఉపాధి హమీ పథకం పనులను పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం సాయంత్రం పర్యటించారు. ఈ బృందంలో ప్రధానమంత్రి సలహాల మండలి చైర్మన్ అమన్జిత్సిన్హాతో పాటు బృందం సభ్యులు గ్రామంలోని వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, తెలంగాణ క్రీడాప్రాంగణం, మహాత్మాగాందీ వననర్సరీలను పరిశీలించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. కేంద్రం అందిస్తున్న ఉపాధి నిధులను అధికారులు సద్వినియోగం చేసేలా చూస్తున్నారని చెప్పారు. అనంతరం కేంద్ర బృందం మంచాల పోలీస్టేషన్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను పరిశీలించారు. ముందుగా మంచాల పల్లెప్రకృతి వనంలో కేంద్ర బృందం సభ్యులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, సర్పంచ్ జగన్రెడ్డి, ఉపసర్పంచ్ జ్ఞానేశ్వర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఈవోపీఆర్డీ తేజ్సింగ్, పలు శాఖల అధికారులున్నారు.