శంకర్పల్లి, డిసెంబర్ 26 : కారు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన శంకర్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. శంకర్పల్లి సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ర్టానికి చెందిన శ్రీభగవాన్(38), చందన్(25) శంకర్పల్లి మండలం మహాలింగాపురం గ్రామంలోని ఎన్సీసీ కంపెనీలో కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై శంకర్పల్లి వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో సింగాపురం వార్డుకు చెందిన సత్తయ్య(50) ద్విచక్రవాహనంపై బయటికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా అదుపు తప్పి తీవ్ర గాయాలపాలయ్యారు. చికిత్స నిమిత్తం నగరానికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.