యాచారం, మే 27: హాస్టల్ నుంచి సంతోషంగా ఇంటికి వెళ్తున్న విద్యార్థిని ఓ ఆటో మృత్యువు రూపంలో కబలించింది. ఎదురుగా వస్తున్న కారు-ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆటోడ్రైవర్ మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటన యాచా రం పోలీస్స్టేషన్ పరిధిలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద నాగార్జునసాగర్-హైదరాబా ద్ రహదారిపై శుక్రవారం జరిగింది. సీఐ లింగ య్య, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండలంలోని నక్కగుట్టతండా సమీపంలో ఉన్న గురుకుల విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు తమ ఇంటికి వెళ్తున్నారు.
ఇబ్రహీంపట్నం వెళ్లేందుకు మాల్ నుంచి వస్తున్న ఆటో ఎక్కారు. ఇందులో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్కు చెందిన శ్రీహర్ష, గండిపేట మండలం నార్సింగ్కు చెందిన మల్లికార్జున్, ఇబ్రహీంపట్నం మండలం పెద్దతుండ్లకు చెందిన ప్రదీప్, లంగర్హౌజ్కు చెందిన రోహిత్ తన చిన్నాన్న కుమారుడు కరుణాకర్ ఆటోలో ఇబ్రహీంపట్నానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో మండల కేంద్రంలోని మం డల పరిషత్ కార్యాలయ సమీపంలోకి రాగానే భారీ వర్షంలో అదుపుతప్పి బోల్తాపడింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి మాల్ వైపు వేగంగా వెళ్తున్న కారు ఈ ఆటోను ఢీకొట్టడంతో విద్యార్థి రోహిత్ (14) అక్కడికక్కడే మృతి చెంద గా మిగతా వారికి గాయాలు కావడంతో వారిని 108 అంబులెన్స్లో నగరంలోని ఉస్మానియా ద వాఖానకు తరలించారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటోడ్రైవర్ నల్లవెల్లి గ్రామానికి చెం దిన శేఖర్ మార్గమధ్యంలో మృతి చెందాడు. శ్రీహర్ష, కరుణాకర్ పరిస్థితి విషమంగా ఉండగా.. ప్రదీప్, మల్లికార్జున్ స్వల్పగాయాలతో బయట పడ్డారు. ప్రమాదంలో కండ్ల ముందే స్నేహితుడ్ని కోల్పోవడం, మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలు కావడంతో వీరు షాక్కు గురయ్యారు. మృతుల కు ఉస్మానియా దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాదం జరిగిన చోట మూలమలు పు ఉండటం, పక్కనే కొన్ని నెలల క్రితం వాటర్ పైపులైన్ కోసం తీసిన గోతిని పూడ్చకుండా వదిలేయడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.