బొంరాస్పేట, జూన్ 17 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమైందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని బాపన్చెరువుతండా, బుర్రితండా, మేడిచెట్టుతండాల్లో రూ.20లక్షల వ్యయంతో నిర్మించే గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మేడిచెట్టుతండాలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని, సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమావేశాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి దూరంగా ఉన్నగిరిజన తండాలు, తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ చొరవతో అభివృద్ధి సాధించాయని, గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వం ఎస్టీ సబ్ప్లాన్ కింద అధిక నిధులు ఖర్చు చేసిందని అన్నారు. 500పైగా జనాభా ఉన్న 3146 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గిరిజనులకు స్వయం పాలన అధికారం కల్పించారని, గిరిజనులకు ప్రభుత్వ పాలనను దగ్గర చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని, రాజధాని హైదరాబాద్లో ఆదివాసీ భవన్ను, కొడంగల్లో గిరిజన భవన్ నిర్మిస్తున్నామని నరేందర్రెడ్డి అన్నారు.
ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్డు, మంచినీటి సౌకర్యం, గ్రామ పంచాయతీ భవనాలను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి చెప్పారు. బాపన్చెరువుతండా పరిధిలోని గిర్కబాయితండా, బాపన్చెరువు తండాలకు రోడ్డు నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేసి త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు. మిగిలిన తండాలకు రోడ్డు, మంచినీరు, విద్యుత్ వంటి సమస్యలను పరిష్కరించడానికి త్వరలో ఆయా తండాల్లో అధికారులతో కలిసి పర్యటించి వాటి పరిష్కరిస్తామన్నారు. మేడిచెట్టుతండాలో ఆటపోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. గిరిజన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యేకు గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ శ్రావణ్గౌడ్, జడ్పీటీసీ అరుణాదేశు, డీఎల్పీవో శంకర్ నాయక్, ఎంపీడీవో పాండు, సర్పంచ్లు లక్ష్మణ్, అంధ్యానాయక్, జ్యోతి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్దన్రెడ్డి, బీఆర్ఎస్ బొంరాస్పేట, దుద్యాల మండలాల అధ్యక్షులు కోట్ల యాదగిరి, చాంద్పాషా, కొడంగల్ మున్సిపల్ కౌన్సిలర్ మధుయాదవ్, ఎంపీటీసీలు నారాయణరెడ్డి, జగదీశ్, తాలుకా, మండల యూత్ అధ్యక్షుడు నరేశ్గౌడ్, మహేందర్, బీఆర్ఎస్ నాయకులు దేశ్యానాయక్, టీటీ రామునాయక్, రమణారెడ్డి, రవిగౌడ్, సోంనాథ్, గోవింద్రెడ్డి, శ్యామలయ్యగౌడ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఘనంగా గిరిజన దినోత్సవం
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని గిరిజనతండా గ్రామ పంచాయతీల్లో గిరిజనులు సంబురాలు చేసుకున్నారు. బొట్లవానితండాలో మహిళలు బతుకమ్మలు చేసి ర్యాలీ నిర్వహించారు. ఉత్సాహంగా పాటలు పాడుతూ ఆటలు ఆడారు.
చైతన్యనగర్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
పెద్దేముల్ : నాటి తండాలు…నేడు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు అయ్యేవిధంగా సీఎం కేసీఆర్ కృషి చేశారని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని చైతన్యనగర్ గ్రామంలో రూ.20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మించనున్న నూతన పంచాయతీ భవన నిర్మాణానికి సర్పంచ్ లలితతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ ఎస్టీ సంక్షేమం, ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రగతినిధి చట్టం(సబ్ప్లాన్), ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు అండగా ‘టీఎస్ ఫ్రైడ్’ ఏర్పాటు, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గిరిజనులకు ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలు, అధికారికంగా ఆదివాసీల పండుగ, ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లలిత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, నాయకులు టి.రమేశ్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ధన్సింగ్, మన్సాన్పల్లి రవి, సర్పంచులు మోహన్రెడ్డి, శ్రావణ్కుమార్, పాండు, ఎంపీడీవో లక్ష్మప్ప, నాగేందర్, మొగులప్ప, ఐసీడీఎస్ సూపర్వైజర్ మీనాక్షి, ఏఎన్ఎం స్వప్న, ఏసు, అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గిరిజన ప్రజల కలలు సహకారం
కులకచర్ల : గిరిజన తండాల ప్రజల కలలు సహకారం చేసిన సీఎం కేసీఆర్ పాలన రాష్ట్రంలో చాలా గొప్పగా సాగుతున్నదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని చెరువుముందలితండా(ఎ)లో పద్మరవిలాల్, చౌడాపూర్ మండలం గోగ్యనాయక్తండాలో సర్పంచ్ రవినాయక్ ఆధ్వర్యంలో పంచాయతీ భవనాలను రూ.20లక్షలతో నిర్మించేందుకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్, బీఆర్ఎస్ చౌడాపూర్ అధ్యక్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, వైస్ ఎంపీపీ రాజశేఖర్గౌడ్, ఎంపీడీవో నాగవేణి, డీఈ ఉమేశ్కుమార్, ఏఈ మణికుమార్, మండల ప్రత్యేక అధికారి ఉపేందర్రావు, ఎంపీవో కరీమ్, బీఆర్ఎస్ నాయకులు నర్సింహులు, మొగులయ్య, రవిలాల్, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, గ్రామస్తులు పాల్గొన్నారు.
కులకచర్ల, చౌడాపూర్లో..
కులకచర్ల, చౌడాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో గిరిజనోత్సవాలు ఆయా గిరిజన తండాల్లో ఘనంగా నిర్వహించారు. గిరిజన తండాలు పంచాయతీలుగా మారిన స్థితిని గ్రామస్తులకు అధికారులు వివరించారు.
పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలి
వికారాబాద్ : ప్రభుత్వం గిరిజనులకు అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదుగాలని వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ సూచించారు. శనివారం వికారాబాద్ మండల పరిధిలోని కొటాలగూడ గ్రామంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గిరిజనోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ చంద్రకళ మాట్లాడారు. ఈ సందర్భంగా డిప్యూటీ జడ్పీ సీఈవో సుభాషిణి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తండాల అభివృద్ధి జరిగిందన్నారు. అనంతరం లంబాడి వేషధారణలో ఎంపీపీ, డిప్యూటీ జడ్పీ సీఈవోలు మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. ముఖ్యఅతిథులను సర్పంచ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాములునాయక్, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో నాగరాజు, ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు కరమ్తోట్ మహిపాల్నాయక్, కార్యదర్శి రాములు పాల్గొన్నారు.
నర్సాపూర్ పెద్దతండాలో..
మర్పల్లి : మండలంలోని నర్సాపూర్ పెద్ద తండాలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్మికులను సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ధరమ్సింగ్, ఎంపీడీవో రాజ మల్లయ్య, ఎంపీవో మహేశ్కుమార్, ఏపీఎం పోచయ్య, మండల నాయకుడు రమేశ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పులిచింతల మడుగుతండాలో..
ధారూరు : మండల పరిధిలోని పులిచింతల మడుగు తండలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో గిరిజన మహిళలు లంబాడి వేషధారణతో నృత్యాలు చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మల్లేశం, ధారూరు మండల అభివృద్ధి అధికారి చంద్రశేఖర్, ఎంపీవో షఫీవుల్లా, సర్పంచ్ సునీతా శంకర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు,అంగన్వాడీ, ఆశ వర్కర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మన తండా- మన అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేయూత
కొడంగల్ : మన తండా- మన అభివృద్ధి సీఎం కేసీఆర్తో సాధ్యపడిందని సర్పంచ్ శంకర్నాయక్ తెలిపారు. శనివారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తండాల్లో గిరిజన ఉత్సవాలు అంబరాన్నంటాయి. మండలంలో పలుగురాళ్లతండా, పోచమ్మతండా, బోయపల్లితండా తదితర గిరిజన తండాల్లో ఉత్సవం హోరెత్తింది. బోనాలు, బొడ్డెమ్మలతో పాటు డీజే సౌండ్స్ ఏర్పాటు చేసి బంజారా నృత్యాలతో తండాల్లో ర్యాలీ తీశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా పోచమ్మతండాలో సమావేశం ఏర్పాటు చేశారు. పలుగురాళ్లతండాలో నిర్వహించిన గిరిజన ఉత్సవంలో ఎంపీడీవో పాండు మాట్లాడారు. కార్యక్రమంలో పోచమ్మతండా ఉప సర్పంచ్ శంకర్నాయక్, పంచాయతీ సెక్రటరీ స్రవంతి, ఉత్సవాల గ్రామ ప్రత్యేకాధికారి రజిత, వసంత్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి రాజునాయక్, ఎంపీవో శ్రీనివాస్, పలుగురాళ్లతండా సర్పంచ్ దీపాబాయి, కోఆప్షన్ సభ్యులు ముక్తార్, ఎంపీటీసీ గోవిందమ్మ, దత్తునాయక్, రాజునాయక్ తోపాటు తండా పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.
గిరిజనులకు గుర్తింపు..
బషీరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులను గుర్తించారని భోజ్యనాయక్తండా సర్పంచ్ శాంతి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆయా తండాల్లో గిరిజనోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు హన్మీబాయి, శంకర్, రవి, పద్మ, దేవ్సింగ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
గిరిజన తండాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
మర్పల్లి : గిరిజన తండాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని సర్పంచ్ సోనిబాయి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గుర్రంగట్టు తండాలో గిరిజనోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పంచాయతీ కార్మికులను సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జనార్ధన్, తండా వాసులు పాల్గొన్నారు.
గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
పరిగి : గిరిజన అభివృద్ధికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు పేర్కొన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పరిగి మండలం నజీరాబాద్తండాలో గిరిజనోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎంపీపీ అరవిందరావు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో డీపీవో తరుణ్కుమార్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, జడ్పీటీసీ బి.హరిప్రియ, ఎంపీడీవో శేషగిరిశర్మ, ఎంపీవో దయానంద్, సర్పంచ్ గణేశ్, ఎంపీటీసీ లక్ష్మి, తండావాసులు పాల్గొన్నారు.